Breaking: కాకినాడ టీడీపీలో ఫ్లెక్సీ వార్.. పావని వర్సెస్ కొండబాబు

కాకినాడ సిటీ టీడీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి..

Update: 2024-02-17 13:01 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సిటీ టీడీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, కో ఆర్డి నేటర్ కొండబాబు మధ్య అధిపత్య పోరు కొనసాగుతోంది. అంతేకాదు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇద్దరి నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలుగు దేశం, జనసేనతోనే సాధ్యమంటూ కాకినాడ సిటీలో మాజీ మేయర్ పావని పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో కో ఆర్డి నేటర్ కొండబాబు ఫొటో లేదు. దీంతో కొండబాబు వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాకినాడ సిటీ టికెట్ ను పావని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కొండబాబు వర్గీయులు అంటున్నారు. 

Read More..

Breaking: సింహాసనం పై శునకం.. నారాలోకేష్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News