బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్‌పై గవర్నర్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Update: 2023-12-01 06:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ వ్యవహారంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‍కు శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ అదానీ సంస్థకు ఇవ్వడాన్ని ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‍పై నిషేధం విధించారని లేఖలో గుర్తు చేశారు. బీచ్ శాండ్ మినరల్స్‌లో అణుధార్మిక శక్తి ఖనిజాలుంటాయని చెప్పుకొచ్చారు. బీచ్ శాండ్ మైనింగ్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం దేశ భద్రతకు ముప్పు అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News