విశాఖ ఎన్జీవో హోమ్‌లో కరోనా కలకలం..

విశాఖలోని ఎన్జీవో హోమ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా..

Update: 2023-04-19 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలోని ఎన్జీవో హోమ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా.. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విషమంగా ఉన్న బాలికను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ హోమ్ లో మొత్తం 17 మంది బాల బాలికలు ఉన్నారు. కరోనాతో ఒకరు మృతి చెందడంతో అప్రమత్తమైన అధికారులు.. హోమ్‌లో ఉన్న 17 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు, అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News