బ్యాండేజ్‌ తీసేసిన CM జగన్.. చిన్న మరక కూడా లేదంటూ నెట్టింట ట్రోల్స్

విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-04-27 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్‌ను కనుబొమ్మపై గాయం అయ్యింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు. అతడ్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నేడు(ఏప్రిల్ 27) సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ నుదుటిపై బ్యాండేజ్ లేకుండా కనిపించారు. పైగా జగన్ నుదుటిపై చిన్న మరక కూడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పరోక్ష పార్టీలు మరిన్ని విమర్శలు గుప్పిస్తున్నారు.

Similar News