అంబేద్కర్కు సీఎం జగన్ నివాళులు
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు మంత్రులు పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, నందిగం సురేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘరామ్లు సైతం నివాళులర్పించారు.