Chittoor: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బోనంవారిపల్లి బస్టాప్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు...

Update: 2023-05-18 12:45 GMT

దిశ, రొంపిచర్ల: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బోనంవారిపల్లి బస్టాప్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు. కలకడ మండలానికి చెందిన రెడ్డి శేఖర్ తిరుమలలో విధులు పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామానికి వెళ్తున్నారు. కలికిరి మండలానికి చెందిన నరేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో పని మీద తిరుపతికి బయల్దేరారు. బోనంవారిపల్లి బస్టాప్ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలు తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులను పోలీసులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News