తిరుపతి అభ్యర్థికే సీటు ఇవ్వాలి.. లేదంటే గాజులు, చీరలు పంపుతారు..!

తిరుపతి జనసేన టికెట్‌ను చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ,,

Update: 2024-03-14 13:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జనసేన టికెట్‌ను చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తిరుపతి టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఆరణి శ్రీనివాసులు నాన్ లోకల్ కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోకల్ నాయకులకు సీటివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన అధ్యక్షుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుపతిలోనే పుట్టామని, తిరుపతి అభ్యర్థికే సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో బలం లేకపోతే చిత్తూరోళ్లు ఫోన్ చేసి.. గాజులు, చీరలు పంపుతారని కిరణ్ రాయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read More..

కాపులు అవసరం టీడీపీకి లేదా: ప్రగడ నాగేశ్వరరావు  


Tags:    

Similar News