టీటీడీ కీలక నిర్ణయం..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Update: 2024-05-24 12:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు.జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. సిఫార్సు లేఖలు స్వీకరించబోమని చెప్పింది. భక్తుల రద్దీ కొనసాగుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ ఉంటుందని తెలిపింది. దీంతో దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Similar News