Ap News: ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. వారికి మరో ఛాన్స్!

రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ...

Update: 2023-06-25 11:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఈనెల 25 నుంచి ఓటర్ల జాబితాలో పేరు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తారన్నారు. జాబితాలో తప్పులుంటే ఇంటింటి తనిఖీల్లో సరిచేస్తామని అన్నారు. 2024 ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో పది లక్షల ఓట్లను తొలగించినట్లు గత ప్రకటనలో ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఆ ఓట్ల తొలగింపుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని... వాటిని ఫేక్ ఓట్లుగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సవరణ చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.

Tags:    

Similar News