ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు దంపతులు
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దంపతులు ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దిశ, వెబ్డెస్క్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దంపతులు ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు ఓటు వేశారు. చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు సీఎం జగన్ కడప జిల్లా భాకరాపురంలో సతీమణి భారతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.