APలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఇదే...!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ..

Update: 2023-02-09 11:24 GMT
  • ఫిబ్రవరి 16న నోటిఫికేషన్
  • మార్చి 13న పోలింగ్.. 16న కౌంటింగ్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. రెండు టీచర్ల ఎమ్మెల్సీ, మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రకాశం -నెల్లూరు-చిత్తూరు...కడప -అనంతపురం -కర్నూలు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు, ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు...కడప- అనంతపురం- కర్నూలు.. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడదుల చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 13న పోలింగ్.. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించునున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవి కూడా చదవండి: 

Breaking News: మళ్లీ సీఎం వద్దకు మైలవరం పంచాయితీ..  

Tags:    

Similar News