హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్లకు బంపర్ ఆఫర్లు

హైదరాబాద్‌లోని ఆంధ్ర ఓటర్లకు ఇప్పటికే నుంచే బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు...

Update: 2024-04-26 16:51 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ జిల్లాలకు చెందిన ఓటర్లకు ఇప్పటినుంచే గాలం వేస్తున్నాయి. ఏపీలోని ఆయా పట్టణాలు, గ్రామాలకు చెందిన ఓటర్లు హైదరాబాద్‌లో ఏఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకుంటున్నారు. వారం చివారంతో ఏపీ నుంచి హైదరాబాద్‌లో వారిని కలుస్తున్నారు. హైదరాబాద్‌లోని పటాన్ చెరు, లింగంపల్లి, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, చందానగర్, అమీర్‌పేట, ఫిల్మ్ నగర్, చింతల్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోలో వంటి ప్రాంతాల్లో ఆంధ్రా ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభ్యర్థులకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఓటర్లు హైదరాబాద్ నుంచి వారి గ్రామాలకు రాను, పోను బస్సులు ఏర్పాటు చేస్తామని భరోసా ఇస్తున్నారు. అసరమైతే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. సొంతంగా వచ్చే వారికి నగదు అందజేస్తామని చెబుతున్నారు. పోలింగ్ ఒకటి, రెండు రోజులు ముందే సొంత ఊర్లకు రావాలని సూచిస్తున్నారు. ఎలాగైనా సరే వారితో తమ అభ్యర్థులకు ఓట్లు వేయించుకునేందుకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరి ఏ మేరకు వారి అభ్యర్థులకు ఓటర్లు మద్దతుగా నిలుస్తారో చూడాలి.

Similar News