శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా నారా భువనేశ్వరి ప్రారంభించి ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ముగిసింది.

Update: 2024-01-04 17:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా నారా భువనేశ్వరి ప్రారంభించి ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ముగిసింది. ఈ మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి, బాధిత కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాల పరిధిలోని నిమ్మతొర్లాడ పంచాయతీ, పాత నిమ్మతొర్లాడ, దనాన్నపేట, బుర్జా మండలంలోని తోటవాడ, జి.సిగడాం మండలంలోని దవలపేట గ్రామాల్లో నిజం గెలవాలి యాత్ర కొనసాగింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News