అప్రమత్తంగా ఉండండి.. నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్

ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Update: 2023-05-30 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు, కూలీలతో పాటు పశువులు, గొర్లు, మేకల కాపరులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అంతేకాకుండా వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండరాదని హెచ్చరించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News