రేపు సెల్‌ఫోన్ల వాడకం బంద్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా రేపు మొబైల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు

Update: 2023-04-10 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వారి  డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా రేపు మొబైల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు. రేపు ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వాడకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తారని హెచ్చరించారు. 

Tags:    

Similar News