ఏపీలో మరో అత్యాచార ఘటన.. బాలికపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి

Update: 2022-04-24 02:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కంచికచర్లకు చెందిన బాలిక స్థానికంగా ఒక బట్టల షాపులో పనిచేస్తోంది. పరిటాలకు చెందిన బొంత సాంబశివరావు ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే సాంబశివరావుకు పెళ్లి అయినట్లు తెలుసుకున్న మహిళ మోసపోయానని గుర్తించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News