జనసేన నేత ఇంటిపై దాడి..మచిలీపట్నంలో ఉద్రిక్తత

మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇంటిపై వైసీపీ అభ్యర్థి కిట్టు అనుచరులు దాడి చేశారని జనసేన నేత కర్రి మహేష్ ఆరోపించారు.

Update: 2024-05-02 12:49 GMT

దిశ,వెబ్‌డెస్క్: మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇంటిపై వైసీపీ అభ్యర్థి కిట్టు అనుచరులు దాడి చేశారని జనసేన నేత కర్రి మహేష్ ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడికి పాల్పడ్డారు. గురువారం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పేర్ని కిట్టు అనుచరులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించడంతో పేర్ని కిట్టు అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనపై జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Read More..

లేడి గెటప్‌లో పవన్, లోకేష్, చంద్రబాబు.. రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ 

Similar News