CM జగన్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-04-16 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా ఓ యువకుడు దాడి చేసినట్లు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌గా గుర్తించారు. దాడి వెనుక ఉన్న కారణాలపై సతీష్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా సతీష్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News