AP News:అభివృద్ధి పై చర్చకు సిద్ధమా!:కూటమి అభ్యర్థి
నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి పనులపై చర్చకు నేను సిద్ధమని, వ్యక్తిగత దూషణలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ఆరోపించారు.
దిశ ప్రతినిధి,ధర్మవరం:నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి పనులపై చర్చకు నేను సిద్ధమని, వ్యక్తిగత దూషణలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ఆరోపించారు. బుధవారం ముదిగుబ్బ మండలంలో ప్రచారం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దైవ సంకల్పం తో ఇక్కడికి వచ్చాను అని తెలిపారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇక్కడ ప్రజలు చూపుతున్న ఆదరణ అభిమానం చూసి ఎంతో ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.