AP Politics:అర్ధరాత్రి వైసీపీ నేత హల్‌చల్..ఆ పార్టీ కార్యకర్తల పై దాడి

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు.

Update: 2024-04-28 12:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు, అధికారులు తమకు ఏమీ తెలియదు అన్నట్లుగానే ప్రవర్తిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఎన్నికల వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం పతాక స్థాయికి చేరింది.

ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా దళితులు, బీసీలపై దాడులకు తెగబడిన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఎన్నికల కోడ్‌‌ని సైతం లెక్క చేయకుండా దాడులకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా అర్ధరాత్రి గ్రామంలో తన అనుచరులతో ప్రజల పై దాడికి పాల్పడ్డారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో రాజశేఖర్ రెడ్డి గ్రామంలో టీడీపీ సానుభూతిపరులైన ఎస్సీలు, వాల్మీకుల ఇళ్లపైకి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఈ విషయాలు చిత్రీకరించిన గ్రామ యువకుడి ఫోన్ లాక్కుని దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News