అధికారంలోకి రాగానే వాళ్లను శిక్షిస్తాం.. సీఎం రమేశ్ మాస్ వార్నింగ్

ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అవినీతిపరులను శిక్షిస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు.....

Update: 2024-04-25 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున సీఎం రమేశ్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ అవినీతిపరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి పరులను శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలనలో అవినీతి పెచ్చుమీరిందని మండిపడ్డారు. కూటమి నేతల మద్దతుతో అనకాపల్లి ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించే ఏ పథకమైనా మొదటిగా అనకాపల్లిలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కల్పన కోసం ప్రయత్నిస్తామని సీఎం రమేశ్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News