AP Politics: నిడదవోలులో పవన్, చంద్రబాబు పర్యటన.. షాక్ ఇచ్చిన కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో కూటమి అధినేతలకు ఉపశమనం లభించింది.

Update: 2024-04-12 08:52 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో కూటమి అధినేతలకు ఉపశమనం లభించింది. నిన్న మొన్నటి వరకు క్షేత్ర స్థాయిలో కత్తులు దూసుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు నేడు కలిసి రావడం, కలిసిపోవడంతో ఇరు పార్టీల అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్ దక్కని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కలిసి నిడదవోలులో పర్యటించారు. కాగా ఈ ఉమ్మడి పర్యటన తణుకు నుండి నిడదవోలుకు రోడ్డు మార్గంలో జరిగింది. కాగా టీడీపీ, జనసేన నేతల సమక్షంలో వేలమంది అభిమానులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి తమ అధినేతలపై పూల వర్షం కురిపించారు.

నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు కలిసిపోవడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయారు. ఇరు పార్టీల కార్యకర్తలు కలిసిపోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. ప్రజలందరూ కలిసి కూటమిని గెలిపించాలని పవన్, చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తారనే నమ్మకం ఇరు పార్టీల అధినేతలకు కుదిరిందని తెలుస్తుంది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News