Amaravati Scam: ఊపందుకున్న దర్యాప్తు.. చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తు

అమరావతి స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకుంది....

Update: 2023-05-15 10:16 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకుంది. కరకట్ట వద్ద చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని జప్తు చేస్తూ ప్రభుత్వం జీవో నెం.89ను జారీ చేసింది. దీంతో నాలుగు కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సీఐడీ పరిశీలస్తోంది. మరిన్ని అధారాలు రాబట్టే పనిలో పడింది. లింగమనేని, హెరిటేజ్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనా లోతుగా పరిశీలన చేస్తోంది. కరకట్ట ఇల్లు మాత్రమే కాకుండా క్విడ్-ప్రో-కోలో ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తోంది.


అలాగే మాజీ మంత్రి నారాయణ సన్నితుల ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీస్తోంది. ఇప్పటికే మనీలాండరింగ్‌కు సంబంధించి పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్ 1944 కింద ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని నగదును జప్తు చేసింది.  

Read more:

NTR Satha Jayanthi Celebrations: నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Tags:    

Similar News