ఎమ్మెల్సీగా అనంత ఉదయ్ భాస్కర్ ప్రమాణ స్వీకారం 

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎమ్మెల్సీగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్‌తో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ధనలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు […]

Update: 2021-12-17 08:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎమ్మెల్సీగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్‌తో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ధనలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టిలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యత్వం ఇవ్వడమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత‌ స్ధానం కల్పించే వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌ అని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు.

అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. అనంతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ మరింత‌ బలపడుతుందని అ‍న్నారు. కష్టానికి నష్టానికి ఓర్చుకున్న వ్యక్తి అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ అనంతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News