చిత్ర పరిశ్రమలో ఆందోళన.. ఆసుపత్రిలో చేరిన ఇద్దరు సీనియర్ నటులు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటుల ఆరోగ్యం అభిమానులను కలవరపెడుతున్నాయి. వరుసగా సీనియర్ నటులు ఆసుపత్రి పాలవ్వడం చిత్ర పరిశ్రమను ఆందోళన పెడుతున్నాయి. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకొని వచ్చిన  బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ నటుడు ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. బాలీవుడ్ […]

Update: 2021-06-30 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటుల ఆరోగ్యం అభిమానులను కలవరపెడుతున్నాయి. వరుసగా సీనియర్ నటులు ఆసుపత్రి పాలవ్వడం చిత్ర పరిశ్రమను ఆందోళన పెడుతున్నాయి. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకొని వచ్చిన బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ నటుడు ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారని ఆయన మేనేజర్ మీడియాకు తెలిపారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న షా నుబుధవారం ఉదయం హాస్పిటల్ లో జాయిన్ చేశామని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందనన్న ఆయన ఒకటి, రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. నసీరుద్దీన్‌ షా వెంట ఆసుపత్రిలో ఆయన సతీమణి రత్న పాథక్‌ షాతో పాటు పిల్లలూ ఉన్నారని అన్నారు.

Tags:    

Similar News