పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్ ఆర్య, సాయేషా తల్లిదండ్రులయ్యారు. హీరోయిన్ సాయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ‘గజినీకాంత్’ అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2019లో మార్చి 10న వివాహం చేసుకున్నారు. ఇక ఆర్య అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాల్లో బిజీ గా మారిపోగా.. సాయేషా కొన్ని సినిమాలలో నటించింది.  ఇప్పటివరకు సాయేషా […]

Update: 2021-07-24 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్ ఆర్య, సాయేషా తల్లిదండ్రులయ్యారు. హీరోయిన్ సాయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ‘గజినీకాంత్’ అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2019లో మార్చి 10న వివాహం చేసుకున్నారు. ఇక ఆర్య అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాల్లో బిజీ గా మారిపోగా.. సాయేషా కొన్ని సినిమాలలో నటించింది. ఇప్పటివరకు సాయేషా గర్భవతి అన్న విషయం మీడియాకు తెలియకపోవడం ఆశ్చర్యం.

ఇక ఇటీవల హీరో విశాల్, సాయేషా తల్లి అయ్యిందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “నా బ్రదర్ ఆర్య, సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నేను మామయ్యను అయ్యాను. ఈ వార్తను రివీల్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. షూటింగ్ మధ్యలో ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆనందపడ్డా.. ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. బిడ్డకు ఎప్పుడు ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు. కోలీవుడ్ లో విశాల్, ఆర్య మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘వాడు- వీడు’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి వీరు ‘ఎనిమీ’ చిత్రం కోసం ఒకటయ్యారు. ఇక ఆర్య మరియు సాయేషా దంపతులకు పాపకు జన్మనిచ్చిన సందర్బంగా నెటిజన్స్ పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow Disha Cinema Official Facebook page :https://www.facebook.com/Dishacinema

Tags:    

Similar News