యాదాద్రి కార్యకర్తల్లో జోష్ పెంచిన రేవంత్ రెడ్డి

దిశ, చౌటుప్పల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ చౌటుప్పల్‌లో రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌ని కాసేపు ఆపారు. చౌటుప్పల్, నారాయణపురం మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను శాలువాలు, గజమాలతో సత్కరించారు. అక్కడికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి కారులో నుండి అభివాదం చేస్తూ […]

Update: 2021-10-01 07:12 GMT

దిశ, చౌటుప్పల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ చౌటుప్పల్‌లో రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌ని కాసేపు ఆపారు. చౌటుప్పల్, నారాయణపురం మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను శాలువాలు, గజమాలతో సత్కరించారు. అక్కడికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి కారులో నుండి అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Tags:    

Similar News