సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలుమార్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవనంద్, కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించి, డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను విచారించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసం ఉంటున్న హైదరాబాద్‌ మేడిపల్లిలోని ఆయన నివాసంలోనూ దాడులు నిర్వహించారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి పత్రాలు లేని రూ. 79,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారం, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ […]

Update: 2021-07-30 07:09 GMT

దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలుమార్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవనంద్, కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించి, డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను విచారించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసం ఉంటున్న హైదరాబాద్‌ మేడిపల్లిలోని ఆయన నివాసంలోనూ దాడులు నిర్వహించారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి పత్రాలు లేని రూ. 79,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారం, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల ప్లాట్ డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News