గోదావరి స్నానానికి వెళ్లి వ్యక్తి గల్లంతు

బంధువుల ఇంటికి వచ్చి సరదాగా గోదావరి స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం పోలవరం ఆంజనేయస్వామి గుడి రేవులో జరిగింది.

Update: 2024-05-05 14:01 GMT

దిశ,పోలవరం: బంధువుల ఇంటికి వచ్చి సరదాగా గోదావరి స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం పోలవరం ఆంజనేయస్వామి గుడి రేవులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ షేక్ అహ్మద్ భాషా (45) పోలవరంలో బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువులు మరో ఏడుగురితో కలిసి గోదావరికి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడం గోదావరి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం వలన గోదావరిలోకి కొట్టుకుపోయాడు.

బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నదిలో పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతునికి ఇంటర్, 7వ తరగతి చదువుతున్న ఒక పాప ఒక బాబు ఉన్నారు. గోదావరి నది లోతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గోదావరిలో స్నానాలకు ఉపక్రమించరాదని గ్రామస్థులు తమ పిల్లలు, సెలవులకు ఇంటికి వచ్చిన బంధువులు గోదావరి స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సూచించారు. కాగా కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం సాయంత్రం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News