కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

దిశ, ముషీరాబాద్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మరణించిన ఘటన అంబర్ పేట వినాయక్ నగర్‌లో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లో వెళితే…. అంబర్ పేట వినాయక్ నగర్‌లో రాజ్ కుమార్(33) నివాసం ఉంటున్నాడు. వారి బిల్డింగ్ లోకి బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరద నీటిని తొలగించేందుకు మోటారు ఏర్పాటు చేశాడు. కొద్ది సేపు పనిచేసిన తర్వాత మోటార్ ఆగిపోయింది. ఏమైందో చూద్దామని అతను నీటిలో దిగాడు. దీంతో అతనికి కరెంట్ షాక్ […]

Update: 2020-10-14 11:40 GMT

దిశ, ముషీరాబాద్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మరణించిన ఘటన అంబర్ పేట వినాయక్ నగర్‌లో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లో వెళితే…. అంబర్ పేట వినాయక్ నగర్‌లో రాజ్ కుమార్(33) నివాసం ఉంటున్నాడు. వారి బిల్డింగ్ లోకి బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరద నీటిని తొలగించేందుకు మోటారు ఏర్పాటు చేశాడు. కొద్ది సేపు పనిచేసిన తర్వాత మోటార్ ఆగిపోయింది. ఏమైందో చూద్దామని అతను నీటిలో దిగాడు. దీంతో అతనికి కరెంట్ షాక్ కొట్టింది. కాగా అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News