లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల్ హాసన్ మద్దతు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు.

Update: 2024-03-09 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. శనివారం స్టాలిన్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతిస్తున్నట్లు కమలహాసన్ ప్రకటించారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలపై డీఎంకే పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ కమల్ హాసన్‌తో భేటీ అయి జరిపిన చర్చలు సఫలం అయ్యారు. కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు.

Tags:    

Similar News