ఉప్పల్ మ్యాచ్ లో రికార్డుల మోత

ఐపీఎల్ 2024 లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs MI మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు.

Update: 2024-03-28 12:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs MI మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. కేవలం 20 ఓవర్లలో 277 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. గతంలో బెంగళూరు పేరు మీద ఉన్న 263 పరుగుల అత్యధిక స్కోరును సన్ రైజర్స్ అధిగమించి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసుకుంది. అలాగే ఇదే మ్యాచులో ముగ్గురు సన్ రైజర్స్ బ్యాటర్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలను నమోదు చేసుకున్నారు. దీంతో పాటుగా ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు(523) నమోదయ్యాయి. దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు 38 నమోదు కాగా.. మొదటి 10 ఓవర్లలో 148 పరుగుల రికార్డు కూడా నమోదు అయింది. దీంతో పాటుగా ఇరు జట్లు అత్యంత వేగంగా 200 పరుగులు నమోదు చేసుకున్నాయి.

Similar News