ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది.

Update: 2024-05-07 13:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన కెప్టెన్ పంత్.. జట్టుకు విజయం అందించలేక పోయాడు. కాగా పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనే భారీ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గానే ఆడుతుంది. మరోవైపు మొన్నటి వరకు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు సన్ రైజర్స్ తో ఓటమి, కేకేఆర్ వరుస విజయాలతో రెండో స్థానంలోకి పడిపోయింది. దీంతో మళ్లీ ఈ మ్యాచ్ లో గెలిచి మొదటి స్థానంలో నిలవడమే కాకుండా.. ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచేందుకు రాజస్థాన్ చూస్తుంది. ఈ క్రమంలో నేడు జరిగే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

Similar News