IPL 2023: రోహిత్ రెస్ట్ తీసుకో.. హిట్‌మ్యాన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కీలక కామెంట్స్..

IPL 2023లో అహ్మదాబాద్‌ మొతెరా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై ఇండియన్స్.

Update: 2023-04-26 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో అహ్మదాబాద్‌ మొతెరా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలం అయ్యాడు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ శర్మకు సూచించాడు.

గుజరాత్ టైటాన్స్‌పై అతను అవుట్ అయిన తీరు తనను ఆందోళనకు గురి చేసిందని.. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించిందని పేర్కొన్నాడు. మళ్లీ ఈ సీజన్ చివర్లో అతను ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చినా పర్లేదని, విశ్రాంతి మాత్రం తప్పనిసరి అని చెప్పాడు. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించగా.. ఆ వెంటనే వరుసగా రెండింట్లో ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి పరిమితమైంది.

Tags:    

Similar News