IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. రీఎంట్రీ ఇవ్వబోతున్న ఫాస్ట్ బౌలర్!

IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్, చెన్నై జట్ల మధ్య ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.

Update: 2023-04-21 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్, చెన్నై జట్ల మధ్య ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. అయితే చెన్నై టీమ్‌కు టాప్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీపక్ చాహర్.. ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడాడు. కానీ, ముంబైతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మళ్తీ గాయపడ్డాడు. దీంతో గత రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే తాజాగా చెపాక్ స్టేడియంలో దీపక్ చాహర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీపక్ చాహర్‌ని గత ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో రూ.14 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా అతడ్ని రిటైన్ చేసుకుంది.

Tags:    

Similar News