ఆర్థిక వేధింపులతో మహిళ ఆత్మహత్య..

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన పోగుల

Update: 2024-04-21 13:13 GMT

దిశ,సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన పోగుల రాయ మల్లమ్మ శనివారం రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే తన దగ్గరి బంధువు దగ్గర తన అవసరాల నిమిత్తం అప్పు చేసిందని అప్పు తీర్చమని పలు మార్లు వేధించడంతో శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున మరణించిందని ఆమె అల్లుడు శ్రీనివాస్ తెలిపారు.

వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడం తో ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. అలాగే ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ఓ ప్రజాప్రతినిధి కీలకంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ ను సంప్రదించగా తమకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై తెలిపారు.

Similar News