వివాహిత ఇంటికి బాంబు పంపిన ప్రియుడు..తర్వాత ఏమైందంటే?

ఇటీవల ప్రేమించకపోతే హత్యలు చేయడం, ప్రేయసిపై అనుమానంతో హత్య చేయడం వంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-05-03 12:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల ప్రేమించకపోతే హత్యలు చేయడం, ప్రేయసిపై అనుమానంతో హత్య చేయడం వంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రేమలో మరో కొత్త కోణం ఏంటంటే మ్యారేజ్ అయినా వారు కూడా ప్రేమలో పడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆమె కోసం ప్రియుడు ఒక పార్సిల్ తన ఇంటికి పంపాడు. ఆ సమయానికి ఆమె ఇంట్లో లేదు. వివరాల్లోకి వెళితే.. ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పంపిన ఘటన గుజరాత్‌లోని వడాలిలో చోటు చేసుకుంది. జయంతిభాయ్ అనే వ్యక్తి తన ప్రియురాలి ఇంటికి బాంబును పార్సిల్ ద్వారా పంపాడు. దాన్ని తీసుకున్న ఆమె భర్త జీతూభాయ్ తెరవడానికి ప్రయత్నించగా అది పేలింది. ఘటనలో జీతూభాయ్‌తో పాటు అతని కుమారై భూమిక (13) మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు అతని భార్య ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News