గుర్తు తెలియని శవం లభ్యం..

మండల పరిధిలోని మక్తమాదారం గేటు సమీపంలోని

Update: 2024-04-30 10:08 GMT

దిశ,కడ్తాల్: మండల పరిధిలోని మక్తమాదారం గేటు సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్ లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించినట్లు కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపారు.వెంచర్లో కాలిన స్థితిలో వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు చెప్పారు.మృతుడు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని,బాడీ కాలిన స్థితిలో ఉందని పరిస్తితులను గమనిస్తే ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లు సీఐ అనుమానం వ్యక్తం చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివప్రసాద్ వివరించారు.

Similar News