హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్పాట్‌డెడ్

హైదరాబాద్‌లోని మీర్‌‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Update: 2024-04-13 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మీర్‌‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం తెల్లవారుజామున గుర్రంగూడ చౌరస్తాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మీట్ పేట్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌లో ఫాఫ్ట్‌వేర్ జాబ్‌లు చేస్తున్న రవి, ప్రణయ్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News