అక్రమ సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలి

నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం ముంగనూరు గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-05-10 09:42 GMT

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం ముంగనూరు గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటన మంగనూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంఘనమోని వెంకటయ్య కు ఇద్దరు భార్యలు తన రెండో భార్య అయినటువంటి తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తన తీరు మార్చుకోని లేకపోలేదు.

ఈ విషయంలో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తారకమ్మ(34) నిద్రిస్తుండగా తల పై బండ రాయితో మోది హత్య చేశాడు. అనంతరం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుని తమ్ముడు రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగ శేఖర రెడ్డి తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News