ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌, కారు ఢీకొని ముగ్గురు మృతి

వేగంగా వెళ్తున్న అంబులెన్స్, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.

Update: 2024-05-07 11:37 GMT

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న అంబులెన్స్, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కేరళలోని కాసర్‌గోడ్‌లోని మంజేశ్వరం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒ ఎమర్జెన్సీ కోసం అత్యంత వేగంగా వెళ్తున్న అంబులెన్స్ మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అలాగే గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News