లారీల టైర్లు, బ్యాటరీల అపహరణ

పార్కు చేసి ఉంచిన లారీల నుంచి బ్యాటరీలు, టైర్లు అపహరించుకుపోయిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-04-26 16:17 GMT

దిశ, భిక్కనూరు : పార్కు చేసి ఉంచిన లారీల నుంచి బ్యాటరీలు, టైర్లు అపహరించుకుపోయిన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దోమకొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావుకు చెందిన రెడీమిక్స్ ప్లాంట్​ వద్ద ఎప్పటి మాదిరిగా నాలుగు లారీలు పార్కు చేసి ఉంచారు. ప్లాంటు హైవే పక్కన ఉండడంతో గుర్తు తెలియని దుండగులు రెండు లారీల బ్యాటరీలు, టైర్లు అపహరించుకుపోయారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు సాయంత్రం భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు ఎస్ఐ సాయి కుమార్ వివరించారు. 

Similar News