ఘోరం.. ఆన్సర్ షీట్ చూపించలేదని ఫ్రెండ్ను కత్తితో పొడిచిన స్టూడెంట్స్
మహారాష్ట్రలోని భివండి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్మేట్స్ విచక్షణరహితంగా దాడి చేయడంతో పాటు కత్తితో పొడిచారు.
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని భివండి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్మేట్స్ విచక్షణరహితంగా దాడి చేయడంతో పాటు కత్తితో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.