ఇన్​ఫార్మర్ నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోలు

చత్తీస్​ఘడ్ రాష్ట్రంలో ఒకపక్క భద్రతా బలగాలు, మరోపక్క మావోయిస్టు మారణహోమం సృష్టిస్తున్నారు.

Update: 2024-05-02 12:11 GMT

దిశ, భద్రాచలం : చత్తీస్​ఘడ్ రాష్ట్రంలో ఒకపక్క భద్రతా బలగాలు, మరోపక్క మావోయిస్టు మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మధ్య జరిగిన వరుస ఎన్​కౌంటర్లలో 88 మంది మావోయిస్టులు భద్రత బలగాల కాల్పులలో చనిపోయారు. దీనికి కారణం ఇన్ఫార్మర్లే అని మావోయిస్టులు ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. బీజాపూర్ జిల్లా తెర్రం మండలం చుత్వహి గ్రామానికి చెందిన మడివి ఉండా, మడివి జోగా అనే ఇద్దరు గిరిజనులను హతమార్చారు. భద్రతా బలగాలకు మావోయిస్టుల గురించి సమాచారం అందిస్తున్నారనే నెపంతో గురువారం వారిద్దరిని మావోయిస్టులు హతమార్చారు.   

Similar News