కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త.. కారణమిదే..!

భార్య భర్తల మధ్య జరిగిన నగదు పంచాయితీలో భర్త కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు.

Update: 2024-02-15 07:16 GMT

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి : భార్య భర్తల మధ్య జరిగిన నగదు పంచాయితీలో భర్త కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, ఇందిర(48)లు ఇరువురికి 26ఏళ్ళక్రితం వివాహం జరిగింది. వారికి అఖిల కూతురు ఉన్నది. కాగా కూతురికి సంబందించిన బంగారు నగలు, నగదు భార్యకు తెలియకుండా వాడుకోవడంలో ఇద్దరిమద్య గొడవ జరిగింది.

దీంతో కోపంతో భార్యపై గొడ్డలితో దాడి చేయడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా ఇల్లుకు గాడియ వేసి పరారయ్యాడు. కూతురు అఖిల ఫోన్ చేస్తే తల్లి ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి చేరుకొని చూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News