గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని
దిశ, చార్మినార్ : మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని చార్మినార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన పులికంటి అరుణ్ ప్రతి రోజు హైకోర్టు నుంచి చాదర్ఘాట్ ఫ్లై ఓవర్ వరకు మూసీ నది ట్రాక్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాడు. మరో జీహెచ్ఎంసి ఉద్యోగి నేరపాటి సంజయ్ అతని వద్దకు వచ్చి మూసీ నది ట్రాక్ వద్ద హైకోర్టు గేట్ నెంబర్ 1 వద్ద మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని సమాచారం అందించారు.
దీంతో అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆమె మెడపై గాయాలు ఉండడంతో అనుమాన స్పద మృతి కింద చార్మినార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సదరు మహిళ ఎవరని తేలితే సాధారణ మరణమా? అనుమాన స్పద మృతినా? హత్యనా? అన్నది వెలుగులోకి వస్తుందని చార్మినార్ పోలీసులు తెలిపారు. ఈ కేసును చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.