ఏసీబీ వలలో పాల్వంచ మున్సిపాలిటీ టీపీఎస్ రమణి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్ లో టీపీఎస్ రమణి బుధవారం పట్టుబడ్డారు.

Update: 2024-04-18 12:11 GMT

దిశ, పాల్వంచ టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్ లో టీపీఎస్ రమణి బుధవారం పట్టుబడ్డారు. పాల్వంచకు చెందిన కాంపిల్లి కనకేష్ ఎల్లారెస్ కోసం దరఖాస్తు చేసుకోగా పర్మిషన్ ఇవ్వడానికి 15 వేల రూపాయలు లంచం అడిగారు. దాంతో కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పక్కా ప్రణాళికతో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా మున్సిపల్ టీపీఎస్ రమణి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్న అనే మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Similar News