రైలు ఢీకొని వృద్ధుడు మృతి..

రైలు ఢీకొని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సురేష్

Update: 2024-04-16 12:51 GMT

దిశ,డోర్నకల్ : రైలు ఢీకొని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సురేష్ ఓ ప్రకటనలో తెలియజేశారు.ఎస్సై కథనం ప్రకారం.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటే క్రమమో.. లేక తెలియని రైలు బండి నుంచి జారిపడో మరణించి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.వివరాలకు 8712658600 చరవాణికి సంప్రదించగలరని కోరారు.

Similar News