పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి బాలుడు మృతి

వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విషాదం

Update: 2024-05-10 11:27 GMT

దిశ,మొయినాబాద్ : వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విషాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డి గూడ గ్రామ పరిధిలో గల సుజాత స్కూల్లో సమ్మర్ క్యాంప్ కొనసాగుతుంది. సురంగల్ గ్రామానికి చెందిన గాండ్ల శివ శౌర్య సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ప్రారంభమైన సమ్మర్ క్యాంపులో మృతుడు శివ శౌర్య బ్యాడ్మింటన్ శిక్షణలో జాయిన్ అయ్యాడు. శుక్రవారం కోచ్ రాకపోవడంతో అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ కు విద్యార్థులను పంపించారు. విద్యార్థులు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తుండగా శివశౌర్యా (6) నీటిలో మునిగి చనిపోయాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే శివ శౌర్య చనిపోయాడని గాండ్ల విక్రం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News