రూ.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలో రూ.25 లక్షలు విలువైన 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-05-07 14:07 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలో రూ.25 లక్షలు విలువైన 100 కేజీల గంజాయిని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే...ఒరిస్సా రాష్ట్రం, మల్కనగిరి నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్​కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో కారులో 100 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పెట్రోలింగ్ నిర్వహించిన వారిలో ఎస్ హెచ్ ఓ రహీమున్నీసా బేగం, ఎస్సై సీతారామరాజు, ఆలీ బాబు, లలిత తదితరులు పాల్గొన్నారు. 

Similar News